మీరు అనుకున్నంత తేలికకాదు జాగ్రత్తగా ఉండండి అంటున్న సునీత!

  • August 19, 2020 / 08:43 AM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండగా దీని దాడి టాలీవుడ్ పై కూడా ఉంది. ఇప్పటికే అనేక మంది కరోనా బారిన పడ్డారు. నిర్మాత బండ్ల గణేష్, దానయ్య, రాజమౌళి కుటుంబం, దర్శకుడు తేజా ఇలా అనేక మంది కరోనా బారినపడ్డారు. కోవిడ్ బారిన పడిన అనేక మంది ప్రముఖులు చాల జాగ్రత్తగా ఉంటున్నారు. ఐనప్పటికి ఏదో ఒకరూపంలో ఈ డెడ్లి వైరస్ ఎలా సోకుతుంది అనేది అర్థం కాకుండా ఉంది. తాజాగా టాలీవుడ్ మరో ఇద్దరు ప్రముఖులు కరోనా బారినపడ్డారు.

సీనియర్ సింగర్ సునీతకు కరోనా సోకింది. ఆమెతో పాటు మరో సింగర్ మాళవికకు కోవిడ్ సోకింది. దీనితో వీరి కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇక సునీతకు కరోనా అని ఉదయం నుండి భారీగా ప్రచారం జరుగుతుంది. దీనితో ఆమె అందరికీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె మాట్లాడుతూ ఆమెకు కరోనా సోకిందన్న వార్త నిజమే అన్నారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో కోవిడ్ టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చిందట.

దీనితో సునీత హోమ్ కొరెంటైన్ కావడంతో పాటు వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నానని ఆమె తెలియజేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చాలా బెటర్ గా ఉందని, అన్నారు. కాగా ఎస్పీ బాలుకు కరోనా సోకి ఐ సి యూ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనితో సింగర్ సునీత బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus