పరిణీతికి అది కావాలంట..!!
- June 17, 2016 / 10:06 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే అవకాశం అందుకోవడంతో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా వార్తల్లో నిలిచింది. తమిళ దర్శకుడు మురుగ దాస్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ కోసం రూ.3.5 కోట్లు పారితోషికం డిమాండ్ చేసి టాక్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ గా మారింది.
టాలీ వుడ్ లోనూ పాగా వేసేందుకు ఈ సుందరి తెలుగును నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ “మేరి ప్యారీ బిందు” సినిమాలో నటిస్తోంది. టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోంది. గురువారం చిత్రీకరణలో పాల్గొన్న పరిణీతి ఎండ వేడికి తట్టుకోలేక పోయింది. అక్కడి లైటింగ్ వేడి కూడా తోడవడంతో భరించలేక పోయింది.
“సెట్ లో చాలా వేడిగా ఉంది. నాకు ఐస్ క్రీమ్ కావాలి” అని ట్విట్టర్ లో తన ఫోటో పెట్టి పోస్ట్ చేసింది. దీంతో ఎక్కువమంది అభిమానులు స్పందించారు. చల్లని మాటలతో కూల్ చేశారు.
Sooooo hot on set I want ice-creammmmmm pic.twitter.com/vDGeII4oC4
— Parineeti Chopra (@ParineetiChopra) June 16, 2016














