దసరా పోటీకి ముస్తాబవుతున్న స్పైడర్, జై లవకుశ
- August 16, 2017 / 08:01 AM ISTByFilmy Focus
దసరా సీజన్లో మూడు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. బాలకృష్ణ, పూరి కాంబినేషన్లో తెరకెక్కిన పైసా వసూల్ కొంత ముందేగానే వస్తోంది. సెప్టెంబర్ 1 న ఈ మూవీ విడుదల అవుతూ పోటీ నుంచి తప్పుకుంది. ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్ బాబు స్పైడర్ సినిమాలు వారం తేడాలో వస్తున్నప్పటికీ గట్టి పోటీ నెలకొని ఉంది. టీజర్స్ విషయంలో మహేష్, ఎన్టీఆర్ లు అందరి అభినందనలు అందుకున్నారు. సినిమా విషయంలో ఎవరు విజయం సాధిస్తారో అనేది సస్పెన్స్ గా మారింది. ఇక సినిమాల నిర్మాణ విషయాలకు వస్తే.. రెండూ కరక్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. మహేష్ స్పైడర్ సినిమాకి సంబంధించి ఇంకా ఒక పాట మిగిలి ఉండగా, ఎన్టీఆర్ జై లవకుశ సినిమాకి సంబంధించి రెండు పాటలు చిత్రీకరించాలి.
మహేష్ ఒక పాటని పూర్తి చేసే సమయానికి ఎన్టీఆర్ రెండింటిని పూర్తి చేస్తారు. ఎందుకంటే స్పైడర్ పాట రెండు భాషల్లో తెరకెక్కిచాల్సి ఉంటుంది. సో ఒకే సమయంలో షూటింగ్ పార్ట్ పూర్తి కానున్నాయి. మిగిలిన కొన్ని రోజుల్లో గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ చేసి జై లవకుశ (సెప్టెంబర్ 21 ), స్పైడర్ (సెప్టెంబర్ 27 )న బరిలోకి దిగనున్నాయి. రెండూ హిట్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















