Sree Vishnu: ఆ రెండు సినిమాల దెబ్బకి .. నిర్మాణ రంగం జోలికి వెళ్లాలనిపించడం లేదు : శ్రీవిష్ణు

  • June 28, 2023 / 09:38 PM IST

శ్రీవిష్ణు.. టాలీవుడ్ లో ఉన్న ప్రామిసింగ్ హీరోల్లో ఒకడు. ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ కొట్టక పోయినా .. అప్పుడప్పుడు డీసెంట్ హిట్లు సాధిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా , రాజ రాజ చోర, వంటి మంచి సినిమాలు చేశాడు.మరో రెండు రోజుల్లో సామజవరగమన అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ , ట్రైలర్ లు బాగున్నాయి. ప్రీమియర్స్ కి కూడా మంచి టాక్ వస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా శ్రీవిష్ణు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. గతంలో శ్రీవిష్ణు నిర్మాతగా కూడా రెండు సినిమాలు చేశాడట. అవే అప్పట్లో ఒకడుండేవాడు, నీదీ నాదీ ఒకే కథ వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా చేశాడట. ఆ రెండు సినిమాలకి మంచి టాక్ వచ్చింది. పెట్టిన బడ్జెట్ కి రికవరీ కూడా జరిగిందట. కానీ ఆ వచ్చిన డబ్బుని వెనక్కి ఎలా తీసుకోవాలి అనేది తెలీదట. అది చాలా టఫ్ టాస్క్ అని చెప్పాడట.

అందులోనూ (Sree Vishnu) శ్రీవిష్ణుకి మొహమాటం ఎక్కువ కాబట్టి గట్టిగా అడగలేక ఇక నిర్మాణ రంగం జోలికి పోకూడదు అని డిసైడ్ అయ్యాడట. అలాగే తన సినిమాల బడ్జెట్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటానని, అనవసరమైన ఖర్చులు నిర్మాతతో పెట్టించడం అస్సలు నచ్చదు అని ఈ సందర్భంగా శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తన ఐడియాలజీ బాగానే ఉందని చెప్పాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus