Srinu Vaitla, Samantha: కాల్ చేసి ఏడ్చేసిన సమంత.. కారణమిదే?

  • September 24, 2021 / 08:24 PM IST

ఏ మాయ చేశావె సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వచ్చే ఏడాది సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కానుంది. బృందావనం, దూకుడు సినిమాలతో సమంతకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీనువైట్ల దూకుడు సమయంలో సమంతకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఇస్తాంబుల్ లో దూకుడు మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరిగిందని

ఒకరోజు సమంతకు షూట్ లేకపోవడంతో షాపింగ్ కు వెళ్లమని ఆమెకు సూచించానని శ్రీనువైట్ల తెలిపారు. సమంత షాపింగ్ కు వెళ్లిన పది నిమిషాల తర్వాత ఆమె ఎదురుగా ఆత్మాహుతి దాడి జరగడంతో ఏడుస్తూ కాల్ చేసిందని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. హ్యూమన్ బాంబ్ ను చూసిన షాక్ నుంచి సమంత తేరులేకపోయిందని శ్రీనువైట్ల వెల్లడించారు. తాను తొలిసారి అక్కడే భూకంపాన్ని చూశానని పెద్ద హోటల్ లో 36వ అంతస్తులోని రూమ్ లో పడుకోగా అంతా ఊగినట్టు అనిపించిందని శ్రీనువైట్ల తెలిపారు.

ఇస్తాంబుల్ లో ముంబైతో పోలిస్తే ఐదు రెట్లు ట్రాఫిక్ ఎక్కువని శ్రీనువైట్ల పేర్కొన్నారు. ఇస్తాంబుల్ నుంచి ఇండియాకు వచ్చే సమయంలో పాస్ పోర్టులు కూడా మిస్సయ్యాయని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా షూటింగ్ సమయంలో పండుగ వాతావరణంలా ఉండేదని శ్రీనువైట్ల వెల్లడించారు. శ్రీను వైట్ల ప్రస్తుతం ఢీ అండ్ ఢీ సినిమాతో బిజీగా ఉన్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus