SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

తెలుగు చిత్రసీమ మాత్రమే కాక యావత్ ప్రపంచ సినిమా ప్రేక్షకులు ఆత్రంగా ఎదురుచూస్తున్న సినిమా “#SSMB29”. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఓ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం మాధవన్ ను (R.Madhavan) ఓ ప్రత్యేక పాత్రలో తీసుకున్నారని కూడా తెలిసొచ్చింది. అయితే.. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు.

SSMB29

ఈ చిత్రంలో మహేష్ ఓ ఆర్కియాలజిస్ట్ అనగా పురావస్తు శాఖకు చెందిన వ్యక్తిగా నటించనున్నాడని మాత్రమే తెలుసు. మొదట్లో “గరుడ” దేవుడు ఆధారంగా కథ ఉండబోతోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమా “సంజీవని పర్వతం” ఆధారంగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి ఈ సంజీవని ఔషధం కోసం ప్రయాణం చేస్తారని, అది కూడా విలన్ కోసమని కహానీ వినిపిస్తోంది.

మరి ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. పాయింట్ అయితే బానే ఉంది. రామాయణం టచ్ చేయడానికి మంచి ఆప్షన్ ఉన్న కథ కావడం, దర్శక దిగ్గజం రాజమౌళి మార్క్ భారీతనం ఎలాగు ఉంటుంది, అందులోనూ 1000 కోట్ల బడ్జెట్ కాబట్టి సరిగ్గా వర్కవుట్ అయితే.. ఇండియన్ సినిమా మొదటి 5000 కోట్ల సినిమాగా #SSMB29 చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. అయితే.. ఈ సినిమా ప్రియాంక చోప్రా నటిస్తున్నప్పటికీ, ఆమె హీరోయిన్ కాదని సమాచారం.

మరి మహేష్ సరసన హీరోయిన్ ఉంటుందా? ఉంటే ఎవరు? అనేది ఇంకా తెలియాల్సి ఉండగా.. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి మీద గుర్రుగా ఉన్నారు. వేరే భారీ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏదో ఒకటి వస్తుండగా.. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా అయిన #SSMB29 సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ ప్రొడక్షన్ హౌజ్ ఇవ్వకపోవడం అనే విషయాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మహేష్ బాబు మాత్రం ఇవేమీ పట్టనట్లు హ్యాపీగా తన ట్రిప్పులకు వెళుతూ, పెళ్లిళ్లకు అటెండ్ అవుతూ హ్యాపీగా గడిపేస్తున్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus