రెండు కిడ్నీలు అమ్ముకోడానికి రెడీ అవుతున్నాను : నటుడు

  • July 7, 2020 / 03:51 PM IST

వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయి.. ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో వారి నెత్తి పై కరెంటు బిల్లులు పిడుగుల్లా పడుతున్నాయనే చెప్పాలి.దేశం మొత్తం ఈ సమస్య ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ‘ఎప్పుడూ 500 రూపాయల బిల్లులు చెల్లించే వారికి .. ఈసారి 10,000 వేలు .. ఇంకొంత మందికి అయితే ఏకంగా లక్షల రూపాయలు బిల్లులు వస్తున్నాయంటూ..

చెప్పి వాటిని మేము ఎలా చెల్లించాలి అంటూ’ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ లిస్ట్ లో సెలబ్రిటీలు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న, తాప్సీ, సందీప్ కిష‌న్‌ వంటి సినీ నటులు కూడా తమకు వచ్చిన క‌రెంట్ బిల్లుల పై షాక్ అవుతూ ట్వీట్లు కూడా వేశారు. తాజాగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ నటుడు అర్ష‌ద్ వార్సి కూడా చేరాడు.

ఇతని ఇంటికి కూడా భారీ మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందట. అతను ఈ విషయం పై స్పందిస్తూ.. “మా ఇంటికి 1,03,564 రూపాయాల క‌రెంట్ బిల్లు వ‌చ్చింది. నేను వేసిన పెయింటింగ్స్ ను ఎవరైనా కొనుక్కుంటాను అంటే.. ఆ వచ్చే డబ్బుతో మా కరెంటు బిల్లు కట్టుకుంటాను. ఆ తర్వాత వచ్చే విద్యుత్‌ బిల్లును చెల్లించడానికైతే.. నా రెండు కిడ్నీల‌ను అమ్ముకోవడానికి రెడీ అవుతున్నాను” అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus