పాన్ ఇండియా స్టార్ హీరోయిన్స్ వింటేజ్ పిక్స్ వైరల్!

  • January 20, 2024 / 05:04 PM IST

దీపికా పదుకోనె, అనుష్క శర్మ, అనుష్క శెట్టి వంటి స్టార్ హీరోయిన్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా దీపికా పేరు మార్మోగుతుంది. రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ.. హీరోయిన్ గా ఆమె డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. అనుష్క శర్మ కూడా అంతే. ఇప్పటికే పెద్ద సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూనే ఉంది. వీరిద్దరితో పోలిస్తే అనుష్క శెట్టి తీరు కొంచెం వేరు.

ఎందుకంటే ఆమెకు పెద్ద సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా.. ఓకే చెప్పడం లేదు. ఎంత ఎక్కువ పారితోషికం ఇస్తాను అని చెప్పినా సరే.. కథాబలం ఉన్న సినిమాలనే చేస్తాను అంటూ పట్టుబట్టి కూర్చుంటుంది. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే .. దీపికా, అనుష్క శర్మ, అనుష్క శెట్టి.. ఈ ముగ్గురు భామలు ఒకే కాలేజీ లో చదువుకున్నారు అనే సంగతి మీకు తెలుసా? అంతేకాదు ఈ ముగ్గురు బెంగళూరుకి చెందిన అమ్మాయిలే అనే సంగతి కూడా ఎక్కువ మందికి తెలిసుండదు.

బెంగళూరులో ఉన్న మౌంట్ కార్మెల్‌ అనే కాలేజీలో దీపికా, అనుష్క శర్మ, అనుష్క శెట్టి..లు చదువుకున్నారు. అయితే వేరు వేరు కాలాల్లో ఈ కాలేజీల్లో చదువుకున్నారు అని తెలుస్తుంది. వీళ్ళ వింటేజ్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఈ భామలు దిగిన ఫోటోలు ఇవి. ఇప్పుడైతే దీపికా, అనుష్క శర్మ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ (Anushka) అనుష్క శెట్టి మాత్రం సినిమాలు తగ్గించినప్పటికీ పెళ్లి ఊసెత్తడం లేదు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus