వైరల్ అవుతున్న ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

  • April 22, 2023 / 02:55 PM IST

ఈ మధ్య కాలంలో సీరియల్ నటీమణులకు సైతం సినీ నటీమణుల స్థాయిలో పాపులారిటీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమ ఎంత మధురం సీరియల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న నటీమణులలో మహేశ్వరి ఒకరు కాగా ఈ నటి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నటి పోషించిన పాత్ర పేరు మాన్సీ కాగా తాను ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు అవుతుందని ఆమె అన్నారు. తాను గుంటూరులో పుట్టి పెరిగానని మహేశ్వరి చెప్పుకొచ్చారు.

సీరియల్స్ అడిషన్ కు వెళ్లిన సమయంలో సెలెక్ట్ కావడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. తాను సీరియళ్లలో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించానని ఆమె అన్నారు. పేరెంట్స్ నుంచి సపోర్ట్ లభించడం వల్లే ఈ ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని మహేశ్వరి కామెంట్లు చేశారు. సినిమా ఇండస్ట్రీలో మగవాళ్లతో కలిసి పని చేయాలని మహేశ్వరి పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఉండే ఆడవాళ్ల గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.

కొందరు నన్ను సైకో అమ్మాయి అని భావిస్తారని నేను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడం వల్ల నాపై అలాంటి అభిప్రాయం కలిగిందని మహేశ్వరి చెప్పుకొచ్చారు. ప్రస్తుత జనరేషన్ లో కెరీర్ పై దృష్టి పెట్టాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. నా బర్త్ డే రోజున కూడా నా గురించి కామెంట్ల రూపంలో బండబూతులు తిట్టారని ఆమె అభిప్రాయపడ్డారు. రూమర్లను ఎదుర్కొని బ్రతకడం నేర్చుకోవాలని మహేశ్వరి అభిప్రాయపడ్డారు.

నా రోల్ వల్ల కొంతమంది కోప్పడతారని ఆమె చెప్పుకొచ్చారు. నేను పోషించిన పాత్రలకు మంచి పేరు రావడంతో సంతోషంగా ఉన్నానని మహేశ్వరి కామెంట్లు చేశారు. మహేశ్వరికి సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది. మహేశ్వరికి పారితోషికం అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus