ఆమెకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా.. హై డిమాండ్!

బాలీవుడ్‌లో భారీ పారితోషికం డిమాండ్ చేసే కథానాయికల జాబితాలో దీపికా (Deepika Padukone), ఆలియా (Alia Bhatt), కత్రినా (Katrina Kaif) లాంటి వారితో పాటు ఇప్పుడు శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కూడా చేరింది. ‘సాహో’తో (Saaho) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ భామ, ఇటీవల ‘స్త్రీ 2’ (Stree 2) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ హర్రర్-కామెడీ సినిమా రూ.700 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంలో శ్రద్ధా కపూర్ నటన కీలక పాత్ర పోషించిందని అభిమానులు కొనియాడుతున్నారు.

Shraddha Kapoor

ఈ సినిమా శ్రద్ధా రేంజ్‌ను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది, ఆమె డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తాజాగా, ఏక్తా కపూర్ నిర్మించనున్న కొత్త లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌లో శ్రద్ధా కపూర్ నటించనుంది. ఈ సినిమాకు సైన్ చేసేందుకు శ్రద్ధా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. రూ.17 కోట్ల పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా కావాలని శ్రద్ధా అడిగినట్లు తెలుస్తోంది. శ్రద్ధా పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఏక్తా కపూర్ ఈ షరతులకు ఒప్పుకుని ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో శ్రద్ధా పాత్ర చాలా యూనిక్‌గా ఉంటుందని, ఇది ఆమెకు, ఏక్తా కపూర్‌కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు. ‘స్త్రీ 2’ విజయం తర్వాత శ్రద్ధా కపూర్ క్రేజ్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ఈ సినిమా ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడమే కాక, బాలీవుడ్‌లో ఆమెను టాప్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఈ క్రమంలోనే ఆమె రెమ్యునరేషన్ విషయంలోనూ భారీ జంప్ చేసింది.

ఏక్తా కపూర్ సినిమాతో పాటు, శ్రద్ధా తదుపరి ‘స్త్రీ 3’లో కూడా నటించనుంది. ఈ హర్రర్-కామెడీ సీక్వెల్ 2027 ఆగస్టు 13న విడుదల కానుంది. ఈ సినిమా కూడా ‘స్త్రీ’ సిరీస్‌లో భాగంగా భారీ అంచనాలతో రాబోతోంది. శ్రద్ధా కపూర్ డిమాండ్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘సాహో’ సమయంలో తెలుగు ఆడియన్స్‌ను ఆకర్షించిన ఈ భామ, ‘స్త్రీ’ సిరీస్‌తో తన సత్తా ఏంటో చాటింది. ఏక్తా కపూర్ థ్రిల్లర్‌లో ఆమె పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

OG: అప్డేట్ తో ట్విస్ట్ ఇచ్చిన విలన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus