Samantha: సమంత పై దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

  • April 19, 2023 / 11:16 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘శాకుంతలం’ డిజాస్టర్ తో ఢీలా పడినట్టు కనిపిస్తుంది. ‘కర్మఫలం అనుభవించక తప్పదు’ అంటూ భగవద్గీతలోని సూక్తులు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆయన కుమార్తె నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు. మొదటి షోతోనే ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా చాలా దారుణంగా నమోదయ్యాయి. సో సమంత అభిమానులు కూడా బాగా హర్ట్ అయ్యారు.

ఇదిలా ఉండగా.. తాజాగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. విషయం ఏంటి అంటే.. ‘ఏమాయ చేసావే’ సమంతకి మొదటి చిత్రం అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం కంటే ముందే సమంత మరో సినిమాకి ఆడిషన్ ఇచ్చింది. అదే ‘నిన్ను కలిశాక’ అనే చిత్రం. దీనికి దర్శకుడు శివ నాగేశ్వర రావు.

గతంలో రాంగోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన ఈయన ‘సిసింద్రీ’ ‘మనీ మనీ’ వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇక 2009 లో వచ్చిన ‘నిన్ను కలిశాక’ చిత్రం కోసం సమంతని చెన్నై నుండి ఆడిషన్ కు పిలిపించారట. ఆమె ఆడిషన్ కూడా బాగా ఇచ్చిందట. కానీ ఆమె పారితోషికం ఎక్కువ అడగడంతో ఆమెను ‘నిన్ను కలిశాక’ సినిమాకి ఎంపిక చేసుకోవడం వీలుపడలేదట.

దీంతో ఆమెను (Samantha) తిరిగి చెన్నై పంపించేద్దామనుకుంటే ఆరోజు సాయంత్రం టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయట. ఆ తర్వాత రోజుకు టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయట. ఈ క్రమంలో ఆరోజు సాయంత్రం అక్కడే ఉండమంటే.. ఆమె ససేమిరా నో చెప్పిందట. దీంతో చేసేదేమీ లేక ఎక్కువ డబ్బులు పెట్టి ఫ్లైట్ టికెట్ కొని ఆమెను చెన్నై పంపించారట.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus