Chiranjeevi: కంగారు పడుతున్న మెగా ఫ్యాన్స్.. కారణమిదే?

  • August 30, 2021 / 08:56 PM IST

మోహన్ రాజా డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ హీరో మాధవన్ ఎంపికైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దర్శకుడు మోహన్ రాజా ఈ మూవీ కాస్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మోహన్ రాజా రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ కావడంతో చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

లూసిఫర్ సినిమా కోసం చిరంజీవి ఇప్పటికే తన లుక్ ను పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. అయితే మాధవన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండటంతో చిరంజీవి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తెలుగులో మాధవన్ విలన్ రోల్స్ లో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సవ్యసాచి, నిశ్శబ్దం సినిమాలలో మాధవన్ విలన్ పాత్రల్లో నటించారు.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అందుకోకపోవడం వల్ల మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే మాధవన్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మాధవన్ సైతం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ మేకర్స్ స్పష్టత ఇస్తే మాత్రమే మాధవన్ ఈ సినిమాలో నటిస్తున్నారో లేదో తెలిసే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కానుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus