Mohan Babu: మోహన్ బాబు కారణంగా రూ.10 లక్షలు జరిమానా కట్టిన స్టార్ హీరోయిన్..!

  • May 21, 2022 / 11:54 AM IST

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డెడికేషన్ కు, డిసిప్లిన్ కు పెట్టింది పేరు. గతంలో ఆయన సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇచ్చేవి. వెంకటేష్, నాగార్జున వంటి హీరోల సినిమాలను మించి కూడా కలెక్షన్లు రాబట్టేవి. నెగిటివ్ రోల్స్, విలన్ రోల్స్ చేసి హీరోగా వచ్చినప్పటికీ మోహన్ బాబు సినిమాలకి అంత క్రేజ్ ఉండేది. అందుకే అప్పట్లో ఆయన్ని కలెక్షన్ కింగ్ అనే వారు. ఇప్పుడంటే పోటీ ఎక్కువైపోయి ఆయన వెనుక పడ్డారు.

టెక్నాలజీని వాడుకోవడం రాక ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. తన సొంత బ్యానర్లోనే సినిమాలు నిర్మించి హిట్లు మీద హిట్లు కొట్టేవారు మోహన్ బాబు. ఇదే క్రమంలో ఆయన ‘తప్పుచేసి పప్పుకూడు’ అనే చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. కోదండరామిరెడ్డి దర్శకుడు. హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆమె కూడా మోహన్ బాబు సరసన నటించడానికి ఒప్పుకుంది. కానీ షూటింగ్ మొదలయ్యే టైంకి తనకి పరీక్షలు ఉన్నాయని చెప్పి మోహన్ బాబు సినిమా షూటింగ్ కు ఆమె వెళ్ళలేదు.

ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు.. ఆమెని ఏమీ అనలేదు. ఆమె స్థానంలో గ్రేసీ సింగ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అప్పటికి ఆమె ‘సంతోషం’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆర్తి అగర్వాల్ మోహన్ బాబుకి అబద్దం చెప్పి వేరే సినిమా షూటింగ్లో పాల్గొంటుందట. ఈ విషయం మోహన్ బాబుకి తెలిసింది. దీంతో ఆయన కోపంతో రగిలిపోయి ఆమెను ఫిలిం ఛాంబర్ కు రప్పించి కంప్లైంట్ ఇచ్చి ఆమెతో రూ.10 లక్షలు ఫైన్ కట్టించుకున్నారు.ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమైంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus