Sukumar, Allu Arjun: 18 ఏళ్ల తర్వాతి కలిశాం అంటూ పోస్ట్‌.. ఎవరెవరంటే?

  • August 4, 2022 / 11:21 AM IST

‘పుష్ప 2’ ఎప్పుడు వస్తుందా అనే ఆలోచన పోయి, అసలు ఎప్పుడు మొదలవుతుంది అనే ఆలోచన అల్లు అర్జున్‌ అభిమానుల మెదడుని తొలిచేస్తోంది. ఎప్పుడో మొదలుపెట్టేస్తారు అని చెప్పినా.. ఇంతవరకు మొదలవ్వలేదు. దీంతో ఎప్పుడెప్పుడు షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారా అని చూస్తున్నారు. అలాంటి వాళ్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పినట్లే చెప్పి, మళ్లీ షాక్‌ ఇచ్చారు అల్లు అర్జున్‌, సుకుమార్‌. ఇద్దరూ కలసి షూటింగ్‌లో పాల్గొన్నట్లు ఓ ఫొటో బయటకు వచ్చింది.

దీంతో వావ్‌ అని అభిమానులు అనుకుంటుండగా.. ‘పుష్ప 2’ కోసం కాదు అని చెప్పారు. దీంతో వావ్‌ అనుకున్న అభిమానులు కాస్త నిరాశపడ్డారు. కానీ బన్నీ లుక్‌ చూసి మురిసిపోయారు. బుధవారం సాయంత్రం సమయానికి సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌, సుకుమార్‌, రత్నవేలు ఉన్న ఓ ఫొటో కనిపించింది. ‘పుష్ప 2’ షూటింగ్‌ మొదలైందబ్బా.. అనుకుంటుండగా.. ఈ ఫొటోలు ఆ సినిమావి కావు అని చెప్పేశారు. ఓ ప్రకటన కోసం ఇద్దరూ కలిశారు అనేది తర్వాత తెలిసింది.

రత్నవేలు కెమెరా కన్నుతో ఆ యాడ్‌ను చిత్రీకరించారట. అయితే ఈ ముగ్గురూ కలవడానికి కూడా ఓ స్పెషల్‌ ఉండటం గమనార్హం. అదేంటంటారా? ఈ ముగ్గురూ సుమారు 18 ఏళ్ల తర్వాత కలసి పని చేశారు. ‘పుష్ప’ తర్వాత వరుస హాలీడ్‌ ట్రిప్‌లు వేసి ఎంజాయ్‌ చేసి బన్నీ.. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నాడు. నిజానికి ‘పుష్ప 2’ షూటింగ్‌ మొదలవుతుంది అన్నా.. బంద్‌ కారణంగా అవ్వడం లేదు. అయితే బన్నీ కెమెరా ముందుకు రావడం మాత్రం ఆగలేదు.

మొన్నీ మధ్య త్రివిక్రమ్‌, హరీశ్‌ శంకర్‌ డైరక్షన్‌లో కొన్ని యాడ్స్‌ చేసిన బన్నీ.. తాజాగా సుకుమార్‌ డైరక్షన్‌లో ఓ యాడ్‌ చేశారు. అందులో భాగంగా తీసిన ఫొటోనే ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 18 ఏళ్ల తర్వాత బన్నీ, సుకుమార్, రత్నవేలు కలిశారు అన్నారు.. ఏ సినిమాకో చెప్పలేదు అనుకుంటున్నారా? అదేనండీ.. 2004లో విడుదలైన ‘ఆర్య’ కోసం ఈ ముగ్గురూ కలసి పని చేశారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus