అవార్డు అందుకున్న విజయేంద్రప్రసాద్, తమన్నా
- July 13, 2017 / 01:54 PM ISTByFilmy Focus
బాహుబలి చిత్రానికి కథని అందించిన విజయేంద్రప్రసాద్ దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. అతనొక్కరే కాదు ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. బాహుబలి టీమ్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, డైరక్టర్లు, నిర్మాతలు బాహుబలితో స్ఫూర్తి పొందారు. అందుకే ప్రముఖ సంస్థ రచయిత విజయేంద్రప్రసాద్, నటి తమన్నాను గౌరవించింది.
‘గ్లోబల్ ఇండియన్ ఇంపాక్ట్ ఐకాన్’ అవార్డుతో సత్కరించింది. ముంబయిలో జరిగిన ‘ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2017’ వేడుకలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ చందా కొచ్చర్ నుంచి ఈ అవార్డుని విజయేంద్రప్రసాద్, తమన్నా అందుకున్నారు. ఈ అవార్డు రావడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని, తమ బాధ్యత మరింత పెరిగిందని వారిద్దరూ చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













