Alekhya Reddy: భర్తను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య…

  • April 10, 2023 / 12:51 PM IST

నందమూరి తారక రత్న మరణించి రెండు నెలల అవుతున్న ఇప్పటికీ ఈయన అభిమానులు తన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తన భార్య అలేఖ్య రెడ్డి నిత్యం తారకరత్న తలుచుకుంటూ ఆ బాధ నుంచి బయటపడలేక పోతున్నారు. ఇలా తారకరత్న గురించి ఇప్పటికే ఎన్నో ఎమోషనల్ వీడియోలు షేర్ చేసిన అలేఖ్య రెడ్డి తాజాగా మరోసారి తన భర్తను తలుచుకుంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. తారకరత్న ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి ఈ దంపతులకు ముగ్గురు సంతానం.

ఇలా జీవితంలో ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నాము అనుకుంటున్న తరుణంలో ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఇలా తారకరత్న మరణం అలేఖ్యను చాలా కృంగదీసింది అని చెప్పాలి. ఇక తారకరత్న మరణించి రెండు నెలలు అవుతున్న ఈమె ఇంకా తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. తాజాగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన భర్త తన పిల్లలతో చాలా సరదాగా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నటువంటి వీడియోలను షేర్ చేశారు.

ఈ వీడియోని షేర్ చేసిన ఈమె (Alekhya Reddy) నిన్ను గుర్తు చేసుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అంటూ కామెంట్ చేశారు. అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకొని షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ తనకు ఈ బాధ నుంచి బయటపడే ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారు.

ఇక తారకరత్న జనవరి 27వ తేదీ నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో ఆయనకు సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన కొన్ని క్షణాలకే తారకరత్న గుండెపోటుకు గురైఈ స్పృహ తప్పి పడిపోయారు. అయితే ఈయనను బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus