Major Movie: పది రోజుల ముందుగానే ‘మేజర్’ స్క్రీనింగ్!

  • May 23, 2022 / 04:50 PM IST

26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ అనే సినిమాను రూపొందించారు. ఇందులో సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను పది రోజుల ముందుగానే స్క్రీనింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రివ్యూను ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్‌లలో సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఈ ప్రివ్యూలను హైదరాబాద్‌, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్‌, కొచ్చి నగరాల్లో ప్రదర్శిస్తారు. దీనికోసం బుక్‌ మై షోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రివ్యూస్‌ చూడాలనుకునేవారు బుక్‌ మై షో లో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఈ తరహా ప్రివ్యూ హాలీవుడ్ లోనే విడుదల చేస్తారు. సినిమా రిలీజ్‌కు ముందు పలు ప్రధాన నగరాల్లో పది లేదా నెల రోజుల గ్యాప్‌తో ప్రదర్శిస్తారు.

సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నవారు.. మరింత పాపులారిటీ కోసం ఇలా చేస్తారు. ఇప్పుడు అడివి శేష్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఇలా రిలీజ్ కు పది రోజులు ముందే ప్రివ్యూలు వేయడం దేశంలో ఇదే తొలిసారి. ఇక ఈ సినిమా టికెట్లు సాధారణ రేట్లతో అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ఇది సాధారణ ప్రేక్షకులు చూడాల్సిన అసాధారణ సినిమా అంటూ ఇటీవల అడివి శేష్ వెల్లడించారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus