సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.!

  • May 18, 2024 / 09:31 AM IST

సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నిర్మాత ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి, సీనియర్ హీరో వేణు  (Venu Thottempudi) తండ్రి, దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్(Surya Kiran), ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్, త్రినాథ్ రావు నక్కిన (Trinadha Rao Nakkina) తండ్రి నక్కిన సూర్యారావు, సీరియల్ నటి జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి ఉంది.

ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఓ సీరియల్ నటుడు మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని సమాచారం. హైదరాబాద్, మణికొండలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఇక ఆత్మహత్య చేసుకున్న ఆ సీరియల్ నటుడు చందు అని తెలుస్తుంది. ‘త్రినయని’ సీరియల్ ద్వారా అతను బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో అతను గాయపడ్డాడు. అదే ప్రమాదంలో మరో ‘త్రినయని’ సీరియల్ ఆర్టిస్ట్.. పవిత్ర జయరాం మరణించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. చందుకి భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో ఇతనికి.. పవిత్ర జయరాంతో పెళ్లైనట్టు కూడా కథనాలు పుట్టుకొచ్చాయి. అందులో ఎంత నిజం ఉందో తెలీదు. ఇక చందు ‘రాధమ్మ పెళ్లి’, ‘కార్తీక దీపం’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించాడు. కెరీర్ సాఫీగా సాగుతున్న టైంలో ఇలా అతను ఇలా చేసుకోవడం విషాదకరం అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus