Chiranjeevi: చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చినా ఆ స్టార్స్ మౌనానికి రీజన్స్ ఇవేనా?

  • January 29, 2024 / 02:34 PM IST

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం టాలీవుడ్ ఇండస్ట్రీకి గర్వ కారణమని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం గురించి స్పందించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది స్టార్ హీరోలు మాత్రం ఈ పురస్కారం గురించి ప్రస్తావించడానికి ఆసక్తి చూపడం లేదు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పేరు, పాపులారిటీ ఉన్న ప్రముఖ సెలబ్రిటీలు చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చినా మౌనంగా ఉండటం కొంతమంది మెగా అభిమానులను బాధ పెడుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా తోటి హీరో సక్సెస్ కు లభించిన అవార్డ్ గురించి ప్రశంసలు వ్యక్తం చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు చిరంజీవి కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. విశ్వంభర మూవీ ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడైన నేపథ్యంలో చిరు కెరీర్ లోనే ఇది రికార్డ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

విజువల్ ఎఫెక్స్ట్స్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో విశ్వంభర కూడా ఓవర్సీస్ లో సంచలన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పద్మవిభూషణ్ పురస్కారంతో చిరంజీవికి 2024 సంవత్సరం అదిరే ఆరంభాన్ని ఇచ్చిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి (Chiranjeevi) కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మల్లిడి వశిష్ట ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. విశ్వంభర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండనుందని తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus