Koratala Siva: కొరటాల కఠిన నిర్ణయానికి అసలు కారణమిదా?

  • July 2, 2021 / 07:32 PM IST

సాధారణంగా స్టార్ డైరెక్టర్లు సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న కొరటాల శివ మాత్రం సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. కొరటాల శివ తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం వేరే ఉందని సమాచారం. చరణ్, చిరంజీవి కాంబినేషన్ లో కొరటాల శివ ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటం గమనార్హం. అయితే ఆచార్య మూవీ ఆలస్యమైన విషయంలో కొరటాల శివ తప్పేం లేకపోయినా కొంతమంది నెటిజన్లు కొరటాల శివను ట్రోల్ చేశారని సమాచారం. మరోవైపు బన్నీతో సినిమా చేస్తున్నట్టు వెల్లడించిన కొరటాల శివ కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ తో మొదట సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ లో కొంతమంది కొరటాల శివను ట్రోల్ చేస్తున్నారు.

అయితే తన తప్పు లేకపోయినా ట్రోల్ చేస్తూ ఉండటంతో హర్ట్ అయిన కొరటాల శివ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. భవిష్యత్తులో కొరటాల శివ సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. లాక్ డౌన్ లో ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన కొరటాల శివ త్వరలో ఆచార్య షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా పనులతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus