Sharwanand: ఆడవాళ్లు రిలీజ్ డేట్ అందుకే మారిందా?

Advertisement

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు శర్వానంద్ మార్కెట్ సైతం తగ్గుతోంది. గతేడాది శర్వానంద్ నటించి విడుదలైన శ్రీకారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా అదే రోజు రిలీజైన జాతిరత్నాలు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శ్రీకారంకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చిందని వార్తలు వచ్చాయి.

Click Here To Watch

అయితే వరుస ఫ్లాపుల్లో శర్వానంద్ ఉన్నప్పటికీ ఈ హీరో కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలు ఏర్పడటానికి కారణమైందని చెప్పవచ్చు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా నిర్మాతకు రిలీజ్ కు ముందే 15 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అయితే మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

భీమ్లా నాయక్ 25వ తేదీన రిలీజ్ కాదనే నమ్మకంతో ఆడవాళ్లు మీకు జోహార్లు మేకర్స్ తమ సినిమాను ఆరోజు రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే భీమ్లా నాయక్ సినిమా అదే రోజుకు ఫిక్స్ కావడంతో ఆడవాళ్లు మీకు జోహార్లు మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. మార్చి 4వ తేదీన అడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ కానుంది. భీమ్లా నాయక్ సినిమా ప్రభంజనాన్ని తట్టుకోవడం తేలిక కాదనే సంగతి తెలిసిందే. శర్వానంద్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా భీమ్లా నాయక్ తో పోటీ పడితే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావు.

ఈ రీజన్ వల్లే సినిమా రిలీజ్ ను వాయిదా వేశారని తెలుస్తోంది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు హిట్ టాక్ వస్తే ఇబ్బంది లేదు కానీ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ రిలీజ్ కానుండటంతో ఇబ్బంది తప్పదు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news