Tollywood: హీరోయిన్ల ఇష్యూ.. మొదటిసారి కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో భాగంగా సిట్ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు పంచుకున్నారు. ప్రభుత్వం తనపై కావాలనే కుట్రలు చేస్తోందని, సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఘాటుగా విమర్శించారు.

Tollywood

తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై కేటీఆర్ ఈ సందర్భంగా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా హీరోయిన్లతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆయన మొదటిసారి గట్టిగా స్పందించారు. కేవలం తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తున్నారని, వీటి వల్ల తన కుటుంబం ఎంతో మానసిక వేదనను అనుభవించిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వారిని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

తాను ఏ తప్పూ చేయలేదని, పుట్టిన మట్టి సాక్షిగా తాను నిర్దోషినని కేటీఆర్ స్పష్టం చేశారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానని, ప్రతి ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెబుతానని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని, ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనతో పాటు మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేయిస్తోందని ఆయన ఒక షాకింగ్ ఆరోపణ చేశారు.

ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటానని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు తన పోరాటం ఆపనని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల కోసం కుటుంబ గౌరవాన్ని బజారున పడేయడం సరికాదని హితవు పలికారు. మొత్తానికి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus