ఏపీ వరద సాయం ప్రకటనలో ఈ విషయం గమనించారా

ఇటీవల కురిసిన వర్షాలకు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ విషయంలో అయినా సాయం చేయడానికి ముందుండే మన టాలీవుడ్‌ స్టార్లు… ఇంకా సాయం ప్రకటించలేదు ఏంటి? అని మనం కొద్ది రోజుల క్రితమే అనుకున్నాం. అయితే తాజాగా మన టాలీవుడ్‌ హీరోలు వరుసగా సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ఓ సారూప్యత కనిపిస్తోంది. దాంతోపాటు డౌట్‌ కూడా వస్తోంది.

ఇటీవల కాలంలో హైదరాబాద్‌కి వరదలు వచ్చినప్పుడు, చెన్నైని వర్షాలు ముంచెత్తినప్పుడు, కరోనా సమయంలో… ఇలా చాలాసార్లు మన స్టార్‌ హీరోలు సాయం ప్రకటించారు. అలానే ఇప్పుడు ఏపీ వరదల గురించి కూడా స్పందిస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా అందరూ ఒకే మొత్తం ప్రకటిస్తున్నారు. అది కూడా ఒకరి తర్వాత ఒకరు, టైమ్‌ గ్యాప్‌ ఇచ్చి మరీ అనౌన్స్‌ చేస్తున్నారు. అందరూ ప్రకటిస్తున్నది ₹25 లక్షలే.

తారక్‌తో ₹25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కాసేపటికి… మహేశ్‌బాబు, చిరంజీవి, రామ్‌చరణ్‌ తమ సాయాన్ని అనౌన్స్‌ చేశారు. ఇదంతా ఒకటో తేదీ సాయంత్రం జరిగింది. రెండో తేదీ మొదలవ్వగానే అల్లు అర్జున్‌ సాయం ప్రకటించాడు. అది కూడా ₹25 లక్షలే కావడం గమనార్హం. ఇంకా కొంత మంది హీరోలు సాయాలు ప్రకటించాల్సి ఉంది. మరి వాళ్లు ఎంత ప్రకటిస్తారో చూడాలి. అంతకంటే ముందే గీతా ఆర్ట్స్‌ ₹10 లక్షల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే మన హీరోలు ఈ సాయం ప్రకటించడానికి కాసేపటికి ముందే… ఏపీలో టికెట్‌ రేటు జీవో వెలువడిందని సమాచారం. దాని ప్రభావమా? లేక ఇంకేమైనా ఉందా? అనేది తెలియాలి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus