Allu Arjun: త్రివిక్రమ్.. ఈసారి రాజమౌళి కంటే హై రేంజ్ లొనే..!

  • October 25, 2024 / 09:15 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే సుమారు 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇది ‘పుష్ప 2’పై దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఇక, ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు టాక్.

Allu Arjun

ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని, ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఫలితంతో త్రివిక్రమ్ కాస్త గ్యాప్ తీసుకుని, ఇప్పుడు పూర్తిగా బన్నీ చిత్రంపై ఫోకస్ చేశాడని తెలుస్తోంది. ఇటీవల లక్కీ భాస్కర్ (Lucky Baskhar)  ప్రమోషన్లలో నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ పై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘త్రివిక్రమ్ సార్, రాజమౌళి (Rajamouli) గారు టచ్ చేయని కొత్త జోనర్ లో ఈ మూవీని తీసుకురాబోతున్నారు. అందుకే ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది,’’ అని చెప్పిన నాగవంశీ, సినిమా గురించి మరింత ఆసక్తి పెంచారు. ‘పుష్ప 2’ విడుదల అనంతరం ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తారని, మార్చి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటి వరకు ఎవరూ చూడని కొత్త వరల్డ్ ని త్రివిక్రమ్ ఈ సినిమాలో సృష్టిస్తున్నారట. అలాగే ఆ విజువల్స్ కూడా అత్యున్నత స్థాయిలో ఉంటాయని నిర్మాత చెబుతున్న మాటలు అభిమానుల్లో ఆతృతను రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి, త్రివిక్రమ్ తను గతంలో చేసిన సినిమాల కంటే పూర్తిగా కొత్తగా, మరింత హై రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

విజయ్ ‘విజిల్’ కి 5 ఏళ్ళు.. తెలుగులో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus