ప్రముఖ ఛానల్స్… రేటింగ్స్ కోల్పోయింది.. వాటి వల్లేనా..?

  • May 19, 2020 / 08:02 PM IST

లాక్ డౌన్ వల్ల కేవలం సినిమా షూటింగ్ లు మాత్రమే కాదు… సీరియల్స్ షూటింగ్ లు … అలాగే కొన్ని పాపులర్ షో ల షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. గతంలో టాప్ ప్లేస్ లో కొనసాగిన కొన్ని ఛానల్స్… రేటింగ్ లు కోల్పోవడంతో టాప్ ప్లేస్ లను కోల్పోయినట్టు తెలుస్తుంది. ఈ లిస్టులో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఈటీవీ లో ప్రసారం అయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షో మరియు స్టార్ మా లో ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్స్ గురించి…! అవును వీటిలో మహిళా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో చూసే ‘కార్తీక దీపం’ సీరియల్ ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉండేది.

రాత్రి 7:30 … అయితే చాలు లేడీస్ అంతా ఈ సీరియల్ కోసం రెడీ అయిపోతారు. మన పవన్ కళ్యాణ్ తల్లిగారు అంజనా దేవి గారు ఈ సీరియల్ కు పెద్ద ఫ్యాన్. అప్పుడప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సీరియల్ చూస్తుంటారట. అంజనా దేవిగారు చెప్పడం వల్ల ఈ సీరియల్ చూస్తారని తెలుస్తుంది. అలాంటి ఈ సీరియల్ వల్ల స్టార్ మా వారు టాప్ ప్లేస్ లో ఉండేవారు. ప్రతీ వారం ఈ సీరియల్ కు 17 ను మించి టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యేది.

ఇక ‘జబర్దస్త్’ ఆ తరువాతి స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు షూటింగ్ లు నిలిచిపోవడం వల్ల .. పాత ఎపిసోడ్స్ ను మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో వీటి రేటింగ్ భారీగా పడిపోయిందని సమాచారం. ఇక వీటి క్రేజ్ పోయినట్టేనా అని అందరిలోనూ అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ ఒక్కసారి మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యి.. మళ్ళీ ఆగిన ఎపిసోడ్ నుండీ కంటిన్యూ చేస్తే… మళ్ళీ ఇవి పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus