భాగ్యనగరాన్ని రీక్రియేట్ చేస్తోన్న క్రిష్!

  • February 20, 2021 / 03:50 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస సినిమాలను కమిట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన పవన్.. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ మలయాళ రీమేక్ లో నటిస్తున్నాడు. అలానే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇటీవల హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసిన పవన్.. వచ్చే వారం మరో కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమా కోసం మరో పది రోజుల డేట్లు ఇచ్చాడు పవన్. ఈ పది రోజుల్లో సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించడానికి క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం గండికోట సెట్ ని రాజీవం నేతృత్వంలో డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం చార్మినార్ సెట్ కూడా వేశారు. చార్మినార్ ఒక్కటే కాదు.. హైదరాబాద్ లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలన్నీ.. ఈ సినిమా కోసం సెట్స్ రూపంలో మళ్లీ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఒక రకంగా చెప్పాలంటే.. ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని మళ్లీ సృష్టిస్తున్నారు. ఈ సినిమా పదిహేడవ శతాబ్దానికి చెందిన కథ. భాగ్యనగర నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పట్లో హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో.. అప్పటి కట్టడాలు ఎలా ఉండేవో.. వర్క్ చేసి వాటికి తగ్గట్లుగా సెట్స్ ని నిర్మించి షూటింగ్ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ సినిమాకి చాలా కీలకమని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత సినిమాలో పవన్ లుక్ ని రివీల్ చేస్తారని టాక్. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus