Vaishnav Tej: పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ప్లాన్‌లో మెగా హీరో.. అందుకే ఆలస్యమా?

టాలీవుడ్‌లో యువ హీరోలందరూ స్పీడ్‌ పెంచుతుంటే, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్‌ (Panja Vaisshnav Tej) మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటున్నాడు. 2023లో ఆదికేశ‌వ (Aadikeshava) రిలీజ్‌ అయిన తర్వాత ఆయన నుంచి ఒక్క అప్డేట్‌ కూడా రాలేదు. ఉప్పెనతో (Uppena) బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న వైష్ణ‌వ్‌ ఆ తర్వాత కొండపొలం (Konda Polam), రంగ రంగ వైభ‌వంగా (Ranga Ranga Vaibhavanga) చిత్రాలతో బరిలో నిలిచినా, బిగ్‌ లెవెల్‌ హిట్‌ మాత్రం అందుకోలేకపోయాడు. ఆదికేశవ కూడా అంచనాలను అందుకోలేకపోయిన నేపథ్యంలో, ఇప్పుడు కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Vaishnav Tej

ఇంతకాలం వైష్ణ‌వ్‌ తేజ్‌ నిశ్శ‌బ్దంగా ఉండటానికి గల అసలు కారణం ఏమిటో పరిశీలిస్తే, ఆయన పాన్‌ ఇండియా స్థాయి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలు స్టార్‌ హీరోలు పాన్‌ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టారు. విరూపాక్షతో (Virupaksha) సాయి తేజ్‌ (Sai Dharam Tej) 100 కోట్ల క్ల‌బ్‌లోకి వెళ్లిన నేపథ్యంలో, తన తర్వాతి సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్లాన్‌ చేశాడు. అలాగే, వైష్ణ‌వ్‌ కూడా ఓ సాలిడ్‌ కంటెంట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడట.

ఈ మ‌ధ్య‌ వచ్చాడయ్యో సామీ అనే టైటిల్‌తో ఓ కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ గురించి ఎటువంటి అఫీషియ‌ల్‌ అప్‌డేట్‌ రాలేదు. ఈ సినిమా రీజనల్‌ మార్కెట్‌కు మాత్రమే సరిపోతుందని, అందుకే కొత్తగా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్‌ లైన్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ కొత్త సినిమా పైన మెగా క్యాంప్‌లో మంచి ఆసక్తి ఉందని తెలుస్తోంది.

వైష్ణ‌వ్‌కి మాస్‌ అండ్‌ క్లాస్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. దీంతో అతను నటించే సినిమాకు పర్ఫెక్ట్‌ డైరెక్టర్‌ అన్వేషణ కొనసాగుతోంది. అందుకే ఈ ఆలస్యం. ఫైనల్‌గా, వైష్ణ‌వ్‌ తేజ్‌ త‌న కెరీర్‌ కోసం మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. పాన్‌ ఇండియా లెవెల్‌లో మంచి కథ రెడీ అయితే, త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి ఓ గ్రాండ్‌ అనౌన్స్‌మెంట్‌ రావొచ్చని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అనిరుధ్ పై రెహమాన్ అల్లుడి డామినేషన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus