వీరసింహారెడ్డి షో ఆపేసి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన ధియేటర్ యాజమాన్యం..!

  • January 12, 2023 / 02:28 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 13 న సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదల కాబోతుంది. నిన్న అర్ధరాత్రి నుండే షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో అయితే ప్రీమియర్స్ పడ్డాయి.అక్కడి నుండీ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది.

సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ డోస్ ఎక్కువైంది అనే కామెంట్స్ వినిపించాయి. అయితే యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను అమితంగా అలరిస్తాయి అని అంతా చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది.దీంతో అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓవర్సీస్ లో అయితే వీరసింహారెడ్డి ప్రదర్శింపబడుతున్న. థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ చేసిన రచ్చ కి ధియేటర్ యాజమాన్యం మండిపడింది.

అంతేకాదు సినిమా ప్రదర్శనను నిలిపివేసి.. తెలుగు సినిమా ప్రేక్షకులు గతంలో కూడా ఇలాంటి రచ్చ చేశారని, సినిమాని ఎంజాయ్ చేయడంలో తప్పులేదు.. కానీ ఇలా ఇంట్రెస్టింగ్ గా సినిమా చూసే వాళ్లకు, ధియేటర్ యాజమాన్యానికి ఇబ్బంది కలిగించకూడదు.. అంటూ తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి:

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus