Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి
- March 24, 2026 / 04:53 PM ISTByPhani Kumar
సూర్య చాలా కాలం తర్వాత ఓ స్ట్రైట్ మూవీ చేస్తున్నాడు. అదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Vishwanath & Sons). ‘సితార ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు.
Vishwanath & Sons
మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా రవీనా టాండన్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే…’విశ్వనాథ్ అండ్ సన్స్’ షూటింగ్లో భాగంగా ఊటీలో నిర్వహించిన షెడ్యూల్లో ఓ ఘటన గురించి వెంకీ అట్లూరి వివరించారు.

వెంకీ అట్లూరి మాట్లాడుతూ…”ఊటీలోని ఫెర్న్హిల్ ప్యాలెస్లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ షూటింగ్ నిర్వహిస్తున్నాం. రెండు రోజులైతే అక్కడ పార్ట్ షూటింగ్ అయిపోతుంది.చివరి రోజు ముందు రాత్రి అంటే మళ్ళీ ప్యాకప్ చెప్పిన అరగంటకే ఒక చిరుతపులి అక్కడికి వచ్చి ఒక కుక్కను చంపి తీసుకువెళ్ళిపోయింది.
మరుసటి రోజు షూటింగ్ చివరి రోజు కావడం, ఇంకా కొద్దిగా వర్క్ పెండింగ్ ఉండటంతో అందరూ టెన్షన్లో ఉన్నారు.రాత్రి 10:30 ప్రాంతంలో మళ్ళీ చిరుతపులి వచ్చిందని తెలిసి సెట్లోని వారు భయంతో అటు ఇటు తిరుగుతున్నారు.ఆ టైమ్లో నేను ‘ఇక్కడ ఏమీ లేదు’ అని చెప్పాను. అదే టైమ్లో నా కళ్ళ ముందే చిరుతపులి వెళ్లింది. ఆ విషయం చెబితే షూటింగ్ ఆగిపోతుంది. ఆ భయంతో నేను కామ్ ఉండిపోయి షూటింగ్ పూర్తిచేశాను.
తర్వాత విషయం చెప్పి అందరూ గుంపులుగా వెళ్ళండి అని చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు.అలా 200 మంది ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ షూటింగ్ చేసినట్టు వెంకీ అట్లూరి తెలిపాడు.
కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్















