Vijayendra Prasad: ఆర్ఎస్ఎస్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. అందుకే నెహ్రూ అలా అంటూ..
- June 9, 2026 / 10:02 AM ISTByFilmy Focus Desk
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.. షార్ట్లో ఆర్.ఎస్.ఎస్. ఈ సంఘాన్ని అభిమానించే వాళ్లు, ఫాలో అయ్యేవాళ్లు, సభ్యులుగా ఉన్నవాళ్లు కొంతమంది అయితే.. మరింకొంతమంది అనుసరించనివారు, నమ్మనివారు, సభ్యులుగా లేనివాళ్లు. దీని గురించి ఇప్పటికీ వర్గాల మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉంటారు. అలా ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ కూడా దీని గురించి మాట్లాడారు. ఫిల్మీ ఫోకస్ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన ఆయన ఆర్ఎస్ఎస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
Vijayendra Prasad
ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి, ఈ దేశం కోసం ఏం చేసింది లాంటి వివరాలు తెలియకుండానే కొంతమంది ద్వేషిస్తున్నారంటూ ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ రెండు సార్లు బ్యాన్ అయిన విషయం గురించి చెప్పుకొచ్చారు. మహాత్మాగాంధీ చనిపోయినప్పుడు ఒకసారి బ్యాన్ చేశారని చెప్పుకొచ్చారు. అలాంటి ఆర్ఎస్ఎస్ 1963లో రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న విషయం గురించి చెప్పారు. మామూలుగా పరేడ్లో ప్రభుత్వం, మిలిటరీ పాల్గొంటాయి. అయితే ఆ రోజున జవహర్ లాల్ నెహ్రూ రిక్వెస్ట్ చేసి ఆర్ఎస్ఎస్ను పరేడ్లో భాగం చేశారని చెప్పుకొచ్చారు.

1962లో చైనాతో యుద్ధం సమయంలో పోలీసులను బోర్డర్లో రక్షణ కోసం తీసుకెళ్లారు. ఆ సమయంలో దేశంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఆర్ఎస్ఎస్ను కోరారు. అప్పుడు వారంతా 70 వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నాలుగు నెలలు దేశంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. దాంతో 1963 పరేడ్లో వారిని భాగం చేశారు అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తొలుత సాయానికి ముందుకొచ్చింది ఆర్ఎస్ఎస్వాళ్లే అని చెప్పారు ఆయన.
ఆర్ఎస్ఎస్ను ఒక మతం, ఒక పార్టీకి సంబంధించింది అని అంటుంటారు. అయితే ఈ మాటలో తప్పేం లేదు అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఒక మతానికి రక్షణగా ఆర్ఎస్ఎస్ నిలవడం సరైన చర్యే అని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. అలా అని తాను ఒక మతానికే పరిమితం కాదని క్లారిటీ ఇచ్చారు. అన్ని మతాల్ని తాను గౌరవిస్తానని చెప్పారు.














