Vishal: యాక్సిండెంట్ పై క్లారిటీ ఇచ్చిన హీరో!

  • June 19, 2021 / 11:00 AM IST

హీరో విశాల్ కు కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ‘పందెం కోడి’ సినిమాతో తెలుగునాట పాపులర్ అయిన విశాల్ ఆ తరువాత ‘అభిమన్యు’, ‘డిటెక్టివ్’, ‘పందెం కోడి 2’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎక్కువగా యాక్షన్ కథలను ఎన్నుకొని ఆడియన్స్ ను అలరిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన నటించిన ‘చక్ర’, ‘యాక్షన్’ లాంటి సినిమాలు నిరాశ పరిచాయి. దీంతో సరికొత్త కథలతో ముందుకు వెళ్తున్నారు.

ప్రస్తుతం ఆయన ‘డిటెక్టివ్’ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మిస్కిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో విశాల్ స్వయంగా సినిమాను డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతో హీరో ఆర్యతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు విశాల్. ‘ఎనిమీ’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో మొదలైంది. రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ ను నిర్మించి అక్కడే షూటింగ్ నిర్వహిస్తున్నారు.

తాజాగా విశాల్ షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో కొందరు రౌడీలు విశాల్ పై గ్లాస్ బాటిల్స్ ను విసిరేస్తూ కనిపించారు. తృటిలో ప్రమాదం తప్పిందని.. స్టంట్ ఆర్టిస్ట్ ల తప్పేమీ లేదని.. టైమింగ్ మిస్ అయిందని.. యాక్షన్ సీక్వెన్స్ లో ఇలాంటివి జరుగుతుంటాయని రాసుకొచ్చారు. దేవుడి దయతో, అందరి ఆశీర్వాదాలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేశామని.. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా తెరకెక్కించినందుకు రవివర్మ మాస్టర్ కు థాంక్స్ చెప్పారు.


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus