విశ్వ‌క్‌, కార్తికేయ మ‌ల్టీస్టార‌ర్‌ కు రంగం సిద్ధం..!

  • December 29, 2020 / 12:47 PM IST

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు కార్తికేయ. అటు తరువాత కూడా వైవిధ్యమైన కథలను.. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యే కథలను ఎంపిక చేసుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇక ఇదే తరహాలో యూత్ కు దగ్గరైన మరో హీరో విశ్వక్ సేన్.! ‘ఈ నగరానికి ఏమైంది?’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు విశ్వక్.

ప్రస్తుతం ఈ కుర్ర హీరో.. ‘ఓ మై కడవులే'(తమిళ్) రీమేక్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి ఓ చిత్రం చేయబోతున్నారనేది తాజా సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ ను విశ్వ‌క్ సేనే నిర్మించబోతున్నాడట‌. కథ ప్రకారం ఈ చిత్రంలో కార్తికేయ లేదా విశ్వక్ లలో ఒకరు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. స్క్రిప్ట్ అదిరిపోయిందట.

అందుకే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ క్రేజీ ప్రాజెక్టుకి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకూ ఎడిట‌ర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చిన ఓ కుర్రాడు ఈ చిత్రంతో డైరెక్టర్ గా మారబోతున్నాడట. త్వరలోనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus