టీవీతో మొదలై… చాలా రోజుల తర్వాత మళ్లీ టీవీ

  • January 7, 2021 / 11:50 AM IST

పూరి జగన్నాథ్‌ దర్శకుడు కాకముందు.. ఆయన స్ట్రగుల్స్‌ ఏంటో అందరికీ తెలిసిందే. ఆ విషయాల్ని ఆయనే చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా మారుతున్న క్రమంలోనే ఆయన ప్రేమ, పెళ్లి కూడా జరిగిపోయాయి. ఈ రెండింటికీ వేదిక ఆయన టీవీ కోసం డైరెక్ట్‌ చేసిన కార్యక్రమం. అంతటి కీలకమైన టీవీలోకి పూరి మరోసారి రాబోతున్నాడు. అవును ఓ టీవీ ఛానల్‌ కోసం పూరి జగన్నాథ్‌ ఓ షో చేయబోతున్నాడట. ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో ప్రసారమవనున్న ‘పుడమి సాక్షిగా’ అనే టాక్‌ షోను పూరి నిర్వహించబోతున్నాడట.

దీనికి సంబంధించి కార్యక్రమాలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పూరి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ తదితరులను ఇంటర్వ్యూ చేయనున్నారట. దాంతోపాటు ఈ షోకి కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలను కూడా తీసుకురానున్నారట. ఈ నెలాఖరున కార్యక్రమం ప్రసారమవుతుందని సమాచారం. టీవీ షోతో కెరీర్‌ను నిలబెట్టుకుంటూ వచ్చిన పూరి… మళ్లీ ఇప్పుడు టీవీ షోకి రావడం ఆశ్చర్యంగా ఉంది కదా.

అయితే కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేయడం పూరికి అలవాటే. పెద్ద తెర మీద అలా విజయం సాధించాడు.. ఇప్పుడు బుల్లితెర మీద కూడా తనదైన మార్కు వేయాలని ఆశిద్దాం.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus