Yellamma: షూటింగ్ ఎప్పుడో చెప్పారు సరే.. ఇంతకీ హీరో ఎవరు?

  • October 16, 2024 / 02:33 PM IST

‘జబర్దస్త్’ కమెడియన్ వేణు ఎల్దిండి దర్శకుడి ఎంట్రీ ఇచ్చి ‘బలగం’ అనే సినిమా చేశాడు. పెద్దగా చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై, దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దిల్ రాజుకి బోలెడన్ని డబ్బులు తెచ్చిపెట్టిన ఈ సినిమా అవార్డులు కూడా తెచ్చిపెట్టడం విశేషంగా చెప్పుకోవాలి.

Yellamma

అయితే ‘బలగం’ తర్వాత వేణు నెక్స్ట్ సినిమా ఏంటి? అని చాలా చర్చ జరిగింది. ‘బలగం’ విడుదలై ఏడాదిన్నర దాటినా ఇంకా తన నెక్స్ట్ సినిమాని సెట్ చేసుకోలేదు. ‘ఎల్లమ్మ’ అనే కథ రాసుకున్నాడు. ముందుగా నానికి వినిపించాడు. నానికి కథ నచ్చింది.. వేణు నెరేషన్ కి బాగా ఇంప్రెస్ అయ్యాడు కూడా. కానీ అతను వేరే డైరెక్టర్లకి కమిట్మెంట్ ఇవ్వడంతో.. దీనికి ఓకే చెప్పలేకపోయాడు. తర్వాత శర్వానంద్ ని కూడా అప్రోచ్ అయ్యాడు వేణు.

అతను కూడా కొన్ని కారణాల వల్ల ఓకే చెప్పలేదు. ఈ క్రమంలో తేజ సజ్జ ఈ కథకి ఓకే చెప్పినట్టు టాక్ నడిచింది. కానీ తేజ కూడా ఇప్పుడు ఖాళీగా లేడు. దీంతో నితిన్ ఫిక్స్ అయినట్లు మళ్ళీ కథనాలు పుట్టుకొచ్చాయి. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించింది లేదు. కానీ దిల్ రాజు మాత్రం 2025 ఫిబ్రవరి నుండి ‘ఎల్లమ్మ’ (Yellamma) షూటింగ్ అని అనౌన్స్ చేసేశాడు. త్వరలోనే హీరో ఎవరు అనేది క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమా కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ నడిచే కథ అని సమాచారం.

ఫాంటసీ ఎలిమెంట్ అందులోనూ యాక్షన్ ఎలిమెంట్స్, డివోషనల్ టచ్ కూడా ఉంటాయని స్పష్టమవుతుంది. సినిమా చివరి 30 నిమిషాల్లో హీరో… కొమురవెల్లి మల్లన్న గెటప్ లో కనిపించి ఫైట్ చేస్తాడని… అది సినిమాకి హైలెట్ గా ఉంటుందని…. ‘కాంతార’ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించే దమ్ము ‘ఎల్లమ్మ’ కథలో ఉందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారట.అందుకే ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లోనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తుంది.

ప్రశాంత్ నీల్ బ్రాండ్ ఆ సినిమాకి కలిసొచ్చేనా..?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus