జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లి పోయావా అమ్మ?

సినీ నటుడుగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఉత్తేజ్ ఒకరు. ఈయన రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన శివ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా నటుడిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉత్తేజ్ ఇంట్లో 2021వ సంవత్సరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తేష్ భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

అయితే ఈమె చికిత్స తీసుకుంటున్న 2021 వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ మరణించారు. ఇలా ఈమె మరి నుంచి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయన కుమార్తె సోషల్ మీడియా వేదికగా తన తల్లిని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఉత్తేజ్ కు (Uttej ) ఇద్దరు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే. పెద్ద కుమార్తె చేతన కాగా రెండవ కుమార్తె పేరు పాట.

ఇలా వీరిద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా తమ తల్లితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అమ్మని తల్చుకుంటూ మాకు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయావా నిన్ను చాలా మిస్ అవుతున్నాం అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక చేతన సైతం తన తల్లితో కలిసి దిగినటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇక చేతన ఇదివరకే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈమె 2017లో పిచ్చిగా నచ్చావ్ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటుతోంది. చిన్న కూతురు పాటకి కూడా ఎంతో మంచి టాలెంట్ ఉంది ఈమెకు సింగింగ్ అంటే ఎంతో ఇష్టం అని తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఆఖీరానందన్ పియానో ప్లే చేయగా ఈమె ఎంతో అద్భుతంగా పాట పాడిన విషయం అందరికీ తెలిసిందే.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags