Kiara Advani: శంకర్ చరణ్ మూవీలో ట్విస్ట్ ఇదేనా?

  • November 5, 2021 / 05:32 PM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరగనుందని తెలుస్తోంది. ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలవనుందని కేజీఎఫ్ సినిమా కొరకు పని చేసిన స్టంట్ మాస్టర్స్ అన్భిరవి ఈ సినిమా కోసం పని చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమాలో కియారా అద్వానీ చరణ్ కు పీఏ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో కియారా అద్వానీ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. సునీల్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని వార్తలు వైరల్ అవుతుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఒకే ఒక్కడు సీక్వెల్ కాకపోయినా ఆ సినిమాకు ఈ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. దిల్ రాజు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. యువ ఐఏఎస్ గా, రాజకీయ నాయకుడిగా చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారని మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus