Mani Chandana: దర్శకుడు తేజ ఇంటి ముందు నిరసన.. నా కష్టం వేస్ట్ అయిపోయింది : నటి మణిచందన.!

  • October 7, 2024 / 01:38 PM IST

సీనియర్ హీరోయిన్ మణిచందన (Mani Chandana) అందరికీ సుపరిచితమే. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్..ను కొనసాగిస్తున్నారు.ఈ మధ్య కాలంలో వరుసగా ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade) వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘దేవర’ (Devara) లో హీరోయిన్ జాన్వీ కపూర్ కి (Janhvi Kapoor) తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. గతంలో ఈమె హీరోయిన్ గా రవితేజ (Ravi Teja) వంటి హీరోల సరసన నటించింది.

Mani Chandana

తమిళ్, కన్నడ భాషల్లోని సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది మణిచందన. వీటికి గల కారణాలను ఈ ఇంటర్వ్యూలో వివరించింది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ‘నిజం’ (Nijam) సినిమాలో కూడా మణిచందన నటించింది. ఇందులో ఆమె రత్తాలు అనే పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా రన్ టైం ఎక్కువగా వచ్చేసింది అని భావించి..

దర్శకుడు తేజ (Teja) కొన్ని సీన్లు డిలీట్ చేసేశాడట. అందులో ఒక పాట కూడా ఉంది. అయితే రిలీజ్ రోజున ఆ పాట లేదు. ఈ క్రమంలో మణిచందన ఫాలోవర్స్ కొంతమంది దర్శకుడు తేజ ఇంటి ముందు నిరసనకు దిగారట. అలాగే మణిచందన కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి ‘నా కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అనే టైపుగా ఆవేదన’ వ్యక్తం చేసిందట. ఈ కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సురేఖ మాటలు వెనక్కి తీసుకున్నా.. టాలీవుడ్‌ జనాల కౌంటర్లు.. ఎటుకు దారితీస్తుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus