‘కరోనా కేసులు ఎక్కువ లేని రోజుల్లో లాక్ డౌన్ కొనసాగించారు. కానీ ఇప్పుడు మరింతగా పెరుగుతున్నా కూడా లాక్ డౌన్ విధించడం లేదు’ అని ఓ పక్క చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించడానికి రెడీగా లేదని స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే.. మరో పక్క కరోనా పేషెంట్స్ ను ఏ హాస్పిటల్స్ లోనూ జాయిన్ చేసుకోకపోవడం మరింత ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి.
ఈ విషయాన్ని చెబుతుంది సామాన్యులు కాదు సెలబ్రిటీలు. వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. “దియా ఔర్ బాతి హమ్” అనే హిందీ సీరియల్ ను “ఈ తరం ఇల్లాలు” గా తెలుగులో డబ్బింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ద్వారా పరిచయమైంది నటి దీపక సింగ్. ప్రస్తుతం ఈమె తల్లికి కరోనా సోకిందట. దీంతో ఆసుపత్రిలో జాయిన్ చెయ్యాలి అని ప్రయత్నిస్తుంటే.. ఢిల్లీ లో ఏ ఆసుపత్రిలోనూ బెడ్ లు ఖాళీగా లేవని చికిత్స చెయ్యడం లేదట.
దీంతో దీపక సింగ్ తన తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేసుకొని త్వరగా చికిత్స అందించాలని బ్రతిమాలుతూ ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేసింది.అంతేకాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ ను ట్యాగ్ చేసింది. ఈ వీడియో చూసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్… వెంటనే స్పందించి దీపక సింగ్ తల్లిని ఢిల్లీ నగరంలోని గంగారాం ఆసుపత్రిలో జాయిన్ చేయించి చికిత్స చేయిస్తున్నారు.
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!