ఓ హీరో కొడుకు స్టార్‌ హీరోను కలవడం పెద్ద విషయం కాదు…

  • December 24, 2020 / 06:39 PM IST

అయితే ఈ రెండూ వెంట వెంటనే జరగడం మాత్రం పెద్ద విషయమే. అదే ఇప్పుడు టాలీవుడ్‌లో జరుగుతోంది. ఉప్పు – నిప్పులా ఉంటే ఇద్దరు అగ్ర నటులు కలసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగుంది. ఆ ఫొటోలు, ఆ నవ్వులు, ట్వీట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఇదంతా ఫ్రంట్‌ సైడ్‌. మరి బ్యాక్‌ సైడ్‌ ఏంటి? ఇప్పుడు టాలీవుడ్‌లో అదే చర్చ. టాలీవుడ్‌ జరిగే ప్రతి పని వెనుక చాలా కారణాలుంటాయి.

తెలుగు పరిశ్రమను ఫాలో అవుతున్న అందరికీ ఈ విషయం తెలిసిందే. కొణిదెల – మంచు కుటుంబాలు చాలా రోజుల నుంచి స్నేహితులు. మధ్యలో చిలిపి తగాదాలు, పెద్ద తగాదాలు, మాటలు, పంచ్‌లు, సెటైర్లు సాధారణం. అయితే ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. చిరంజీవి, మోహన్‌బాబు మధ్య అంతా సాఫీగానే ఉంది. మొన్నామధ్య ఇద్దరూ కలసి నటిస్తున్నారనే వార్తలూ వచ్చాయి. అయితే దీనిపై అధికార ప్రకటన రాలేదు. ఆ తర్వాత ఆ ఊసు కూడా లేదు.

కట్‌ చేస్తే మంగళవారం రాత్రి మంచు విష్ణు ఓ ట్వీట్‌ చేశాడు. అందులో చిరంజీవితో కలసి దిగిన ఫొటో పెట్టి ‘విషయాలు తర్వాత చెబుతా’ అని రాసుకొచ్చాడు. బుధవారం మోహన్‌బాబు ‘ఆచార్య’ సెట్‌కి వెళ్లి చిరంజీవిని కలిశాడు. చేతిలో పూల బొకేతో కొన్ని ఫొటోలు బయటికొచ్చాయి. అయితే వరుసగా మంచు కుటుంబం చిరంజీవిని ఎందుకు కలుస్తోంది. అసలు ఏం నడుస్తోంది అనేదే ఇప్పుడు టాపిక్‌. విష్ణు కలిసినప్పుడు ‘మోసగాళ్లు’ ప్రచారం కోసమని, ‘లూసిఫర్‌’ రీమేక్‌లో ఓ రోల్‌ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు మోహన్‌బాబు ఎందుకు కలిసినట్లు. కొడుకు సినిమా ప్రచారం కోసం చిరంజీవి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడా అనేది ఇప్పుడు చర్చ. చూద్దాం ఈ విషయంలో ఎప్పటికి క్లారిటీ వస్తుందో?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus