పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపెట్టిన పనిమనిషి ఈశ్వరి!

  • April 2, 2023 / 08:08 PM IST

ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో గత కొద్దిరోజుల క్రితం దొంగతనం జరిగిందని ఇంట్లో 60 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించలేదు అంటూ ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఫిర్యాదులో భాగంగా తన పని మనుషులపై ఈమె సందేహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక ఈమె ఫిర్యాదు మేరకు పోలీసులు తన ఇంట్లో పని మనుషులను విచారించారు. ఈ విచారణలో భాగంగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

పోలీసు విచారణలో భాగంగా పనిమనిషి ఈశ్వరి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు తనకు సిటీలో రెండు ఇండ్లు ఉన్నాయని తనకు దొంగతనం చేసే అవసరం ఏమాత్రం లేదంటూ ఈమె తెలిపారు. అయితే పోలీసులు తమ స్టైల్ లో విచారణ చేయగా చివరికి ఈశ్వరి తానే ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం చేశానని ఒప్పుకున్నారు. అయితే ఈ దొంగతనం చేయడానికి కారణాన్ని కూడా ఈమె తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈశ్వరి మాట్లాడుతూ తాను ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం చేయడానికి ఆమె కారణమని తెలిపారు.కొన్ని సంవత్సరాలుగా తన ఇంట్లో గొడ్డులా చాకిరీ చేస్తున్నాను అయితే జీతం మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారని తెలిపారు. ఈమె నెలకు 30000 రూపాయల జీతం ఇస్తున్నారని, ఇది తన కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోలేదని అందుకే తను దొంగతనానికి పాల్పడ్డాను అంటూ ఈ సందర్భంగా ఈశ్వరి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈశ్వరి ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించగా ఈమె ఇంట్లో ఏకంగా 100 సవర్ల బంగారం, నాలుగు కిలోల వెండి, 36 గ్రాముల వజ్రాలు లభించాయి. ఇలా ఐశ్వర్య ఇంట్లో దొంగతనం చేసిన బంగారం కన్నా ఇంట్లోనే ఎక్కువ బంగారం ఉండటంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. అయితే ఇవన్నీ తనకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈమె చాలాకాలంగా ధనుష్ ఇంట్లో మాత్రమే కాకుండా రజినీకాంత్ ఇంట్లో కూడా పనులు చేసే వారని తెలుస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus