చిరంజీవి ఆ ప్రాజెక్టు కు ఓకే చెబితే రచ్చ రచ్చే..!

  • August 2, 2020 / 11:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అని నిశ్చయించుకున్న టైములో ఆయన ఎన్నో కథలు విన్నారు. అప్పటి స్టార్ డైరెక్టర్ల దగ్గర నుండీ కుర్ర డైరెక్టర్ల వరకూ ఎన్నో స్టోరీ సిట్టింగ్ లు వేశారు. కానీ అవన్నీ పూర్తిగా చిరుని సంతృప్తి పరచలేదు. అయితే ఒకానొక టైంలో డ్యాషింగ్ డైరెక్టర్ ‘పూరి జగన్నాథ్ తో ‘చిరు 150′ సినిమా ఫిక్స్’ అని కూడా వార్తలు వచ్చాయి. స్వయంగా రాంచరణే.. ఈ ప్రాజెక్టు ను కన్ఫర్మ్ చేశాడు. ‘ఆటో జానీ’ అనే పేరుని కూడా ఫిక్స్ చేశారు.

కానీ సెకండ్ హాఫ్ విషయంలో చిరు సంతృప్తి చెందకపోవడంతో.. పూరి సినిమాని పక్కన పెట్టి, ‘కత్తి’ రీమేకే సేఫ్ అని చిరు ‘ఖైదీ నెంబర్ 150’ చేశారు. మెగాస్టార్ – పూరి కాంబినేషన్లో సినిమా క్యాన్సిల్ అవ్వడంతో.. పూరి ఫ్యాన్స్ తో పాటు చిరు ఫ్యాన్స్ కూడా హార్ట్ అయ్యారు.ఏ హీరోని అయినా తన సినిమాల్లో ఓ రేంజ్లో ప్రెజెంట్ చేసే పూరి.. మెగాస్టార్ ను కూడా అదే స్థాయిలో ప్రెజెంట్ చేస్తాడు అని అంతా ఆశ పడ్డారు. కానీ వారి ఆశ నెరవేరలేదు.

ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ గురించి అంతా మర్చిపోయారు. అయితే ఐదేళ్ళ తరువాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. పూరి ఈ ప్రాజెక్ట్ లో చేసిన మార్పులు చిరుకి నచ్చాయట. వీళ్ళ తరువాతి సినిమాల కమిట్మెంట్స్ ను బట్టి ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేది.. లేనిది .. ఓ క్లారిటీ వస్తుందని సమాచారం.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus