2024 కి గాను గద్దర్ ఫిల్మ్ అవార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. విజేతల లిస్ట్ ను కూడా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 2020 నుండి 2023 వచ్చిన సినిమాలకి అవార్డుల లిస్ట్ ను తర్వాత ప్రకటించారు.అవార్డుల నిమిత్తం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయట. వాటిని పరిశీలించి తర్వాత విజేతలను ప్రకటించారట. ఈ క్రమంలో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (Allu Arjun) ఎంపికయ్యారు. ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాకి గానూ అల్లు అర్జున్ కి ఈ అవార్డు లభించింది.
అలాగే ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) ‘పోట్టేల్’ (Pottel) వంటివి ఉత్తమ చిత్రాలుగా అవార్డులు గెలుచుకున్నాయి. ఇదిలా ఉండగా.. తనకు ఉత్తమ అవార్డు లభించడంపై అల్లు అర్జున్ స్పందించి తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. ‘ గద్దర్ అవార్డ్స్ లో భాగంగా ‘పుష్ప 2’ సినిమాకి ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ‘పుష్ప 2’ సక్సెస్ క్రెడిట్ మొత్తం మా దర్శకుడు సుకుమార్ (Sukumar), నిర్మాతలు, మొత్తం యూనిట్ కు చెందుతుంది.
నా అభిమానులందరికీ ఈ అవార్డు అంకితం. వారి అప్రిసియేషన్ నా ఇన్స్పిరేషన్’ అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు బన్నీ. అయితే తన ట్వీట్లో రేవంత్ రెడ్డి పేరుని ట్యాగ్ చేయకపోవడాన్ని.. వేలెత్తి చూపిస్తున్నారు కొందరు నెటిజన్లు. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు ట్యాగ్ చేయలేదని, పైగా తెలంగాణ ప్రభుత్వం అవార్డుతో సత్కరిస్తే.. అభిమానులకు అంకితం అని లెక్కలేనట్టు స్పందించడం పై కూడా కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
I am truly honoured to receive the first Best Actor award for #Pushpa2 at the #GaddarTelanganaFilmAwards 2024.
Heartfelt thanks to the Government of Telangana for this prestigious honour .
All credit goes to my director Sukumar garu, my producers, and the entire Pushpa team.
I…
— Allu Arjun (@alluarjun) May 29, 2025