BA Raju: మహేష్ బాబు బి.ఎ.రాజుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడట..!

  • May 22, 2021 / 04:51 PM IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత,సినీ పాత్రికేయులు అయిన బి ఏ రాజు గారు ఈరోజు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. ఈయన సూపర్ స్టార్ కృష్ణ గారి వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు.ఆ ఫ్యామిలీకి ఈయన అత్యంత సన్నిహితులు. కృష్ణ గారి సినిమాలతో పాటు ఇప్పుడు మహేష్ బాబు సినిమాలకు ఈయన పనిచేస్తున్నారు. ఈయన నిర్మించిన ‘లవ్ లీ’ ‘వైశాఖం’ సినిమాల ఆడియో విడుదల కార్యక్రమాలకు కూడా మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యేవాడు.

అక్కడితో ఆపేయలేదు.. రాజు గారి కోసం మహేష్ బాబు ఏకంగా నిర్మాతనే మార్చేసిన సందర్భం కూడా ఒకటి ఉందట. మహేష్ బాబు కెరీర్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మించింది ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుని ముందుగా మరో నిర్మాణ సంస్థ నిర్మించాల్సి ఉందట. అయితే వారు ఈ ప్రాజెక్టుకి పి.ఆర్.ఓ గా రాజు గారిని కాకుండా వేరే వాళ్ళని పెట్టుకుందాం అని మహేష్ తో చెప్పారట. దానికి మహేష్ ఒప్పుకోలేదట.

తర్వాత కొద్ది రోజులకు వేరే నిర్మాత ఉంటే చూడమని మహేష్ ప్రకటన ఇప్పించినట్టు తెలుస్తుంది. దాంతో ఓవర్సీస్ లో మహేష్ సినిమాలను పంపిణీ చేసే ‘మైత్రి’ వారు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ‘మైత్రి’ వారు ఎప్పటి నుండో నిర్మాతలుగా మారాలని అనుకునేవారట. అందుకు ఎన్టీఆర్ తో సంప్రదించారని తెలుస్తుంది. అయితే ఫైనల్ గా మహేష్ తో వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus