Akhanda: అఖండ డైలాగ్ సీక్రెట్ చెప్పుకొచ్చిన బాలయ్య!

  • December 3, 2021 / 10:57 PM IST

సింహా, లెజెండ్ సినిమాల తర్వాత ఆ స్థాయి హిట్ లేని బాలకృష్ణకు అఖండ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో చేరింది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అఖండ సినిమా కళ్లు చెదిరే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో నైజాం ఏరియాలో బాలకృష్ణ మార్కెట్ పెరిగిందనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

వీకెండ్ వరకు అఖండ జోరు తగ్గే అవకాశం లేదు. వీకెండ్ తర్వాత కూడా మరే సినిమా అఖండకు పోటీనిచ్చే అవకాశం లేదు కాబట్టి పుష్ప ది రైజ్ రిలీజయ్యే వరకు అఖండ ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. బాలయ్య ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడే సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను తనకు రాయల్టీ ఇవ్వాలని బాలకృష్ణ తెలిపారు. ఎవరైనా తనను దేవుడిని చూపించాలని అడిగితే వాళ్లను ఒక దెబ్బ కొట్టి మాట్లాడతానని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఆ తర్వాత అవతలి వ్యక్తిని నొప్పి కనిపించిందా అని అడిగి అదే దేవుడు అని చెబుతానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తన దగ్గర ఆ విషయాన్ని గమనించి సినిమాలో “దేవుడిని కరుణించు అనాలి.. కనిపించు అని కాదు” అనే డైలాగ్ పెట్టారని ఈ రీజన్ వల్లే తనకు రాయల్టీ ఇవ్వాలని బాలకృష్ణ తెలిపారు. అఖండ సక్సెస్ తో తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు కళకళలాడుతున్నాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus