Bandla Ganesh: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పూరి… వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోస్!

  • May 11, 2023 / 07:09 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ గురించి పరిచయం అవసరం లేదు ఈయన డైరెక్షన్లో వచ్చినటువంటి లైగర్ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరీ జగన్నాథ్ కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడింది అని చెప్పాలి.ఇలా ఈ సినిమా తర్వాత భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ తన సినిమాలకు కొంత విరామం ఇచ్చారు.

ఇక పూరి జగన్నాథ్ నటి చార్మి కలిసి సినిమాలను నిర్మించడంతో వీరిద్దరూ కలిసి ఎక్కువగా ముంబైలో ఉంటున్నారు. దీంతో పూరి జగన్నాథ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే బండ్ల గణేష్ సైతం పూరి జగన్నాథ్ పై ఇదే విషయం గురించి తీవ్ర స్థాయిలో మండిపడుతూ గతంలో చేసిన కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారితీసాయో మనకు తెలిసిందే. ఇకపోతే చాలా కాలం తర్వాత పూరి జగన్నాథ్ తన భార్య పిల్లలతో కలిసి కనిపించడంతో పూరి జగన్నాథ్ దంపతుల గురించి వచ్చే వార్తలన్నింటికీ పులి స్టాప్ పడినట్టు అయ్యింది.

పూరి జగన్నాథ్ తన భార్య పిల్లలతో కలిసి తన సొంత ఊరిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఇక పూరి జగన్నాథ్ దంపతుల సైతం ప్రత్యేకంగా ఒక హోమం నిర్వహించారు.ఇలా ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన ఈయన మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అన్న వదిన అంటూ ట్వీట్ చేశారు.

ఇక బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా పూరి జగన్నాథ్ తన భార్యతో చాలా సంతోషంగా ఈ పూజలో పాల్గొన్నారని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ ఫోటోలు చూస్తే కనుక వీరి విడాకుల గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని తెలుస్తోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus