చీటింగ్ కేసు పై రియాక్ట్ అయిన నిర్మాత బెల్లంకొండ సురేష్..!

  • March 12, 2022 / 02:04 PM IST

టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు అతని తనయుడు ప్రముఖ హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పై నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఛీటింగ్ కేసు న‌మోదైన సంగతి తెలిసిందే. మార్చి 2018-19 టైములో శరన్ అనే ఫైనాన్సియర్ వద్ద ఈ తండ్రీ కొడుకులు రూ.85 ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నార‌ని.. అతను పోలీసులని ఆశ్రయించాడు. ఈ విషయం పై బెల్లకొండ సురేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “నన్ను నా ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్ర ఇది.

Click Here To Watch Now

అందులో భాగంగానే నా పై కేసు పెట్టించారు.నాకు శరన్ అనే వ్యక్తి ఎలాంటి డబ్బు ఇవ్వలేదు.నన్ను నా కొడుకుని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు.శరన్ నుండీ మేము ఒక్క పైసా కూడా తీసుకోలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇచ్చుకోవచ్చు.శరన్ తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు.నేను డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయట పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా. నా ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులుపెట్టిస్తున్నారు.

నేను పోలీసుల విచారణకు సహరిస్తా.85 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ శరన్ నాపై ఆరోపణ చేసాడు.కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు.అతని దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చారు.నా పిల్లలు జోలికి వచ్చాడు.నా పిల్లలు నా పంచ ప్రాణాలు.శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటాను..!కచ్చితంగా అతని పై పరువు నష్టం దావా వేస్తా.నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదు.నా పై ఆరోపణలు చేసిన శరన్ కే నోటీసులు ఇచ్చారు.

శరణ్ ది మా ఊరే… పదేళ్ళ క్రితం పరిచయం.. టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడు.శరణ్ అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు.. అతను క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోను.బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు.శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు.. అతనెవరో బయట పెడతా..!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus