Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?
- September 10, 2026 / 04:23 PM ISTByFilmy Focus Desk
మలయాళ సినిమాలకు తెలుగు యువత ఫ్యాన్స్ అవ్వడం, వాళ్లు కథలకు నిరంతరం జై కొట్టడం, మమితా బైజు క్యూట్ నెస్కి మనవాళ్లు మురిసిపోవడం.. లాంటి కారణాల వల్ల నివిన్ పౌలీతో ఆమె నటించిన ‘బెత్లెహేమ్ కుడుంబ యూనిట్’ సినిమాను మన దగ్గర బాగా లేపారు. కేరళలో ప్రభంజనం సృష్టిస్తున్న ఆ సినిమాను తెలుగులో ఎప్పుడు తీసుకొస్తారు అనే ఎదురుచూపులు మొదలయ్యాయి. అనుకున్నట్లుగానే ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ అని ఒరిజినల్ పేరుకు దగ్గరగా పేరు పెట్టి తెలుగులో విడుదల చేసేశారు.
Bethlehem Kudumba Unit
అయితే, ఇక్కడే సమస్య వచ్చింది. కేరళలో, ఓవర్సీస్లో మొత్తంగా రూ.300 కోట్ల వసూళ్లు అందుకోబోతున్న ఈ సినిమాకు తెలుగులో ఎదురు దెబ్బ తగిలింది. సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ డబ్బింగ్ సినిమాకు సరైన ఆదరణ దక్కడం లేదు. కొన్ని కారణాల వల్ల మల్టీప్లెక్స్లు ఈ సినిమాను ప్రదర్శించడం లేదు. మరోవైపు టైటిల్ ఇబ్బంది కారణంగా సినిమాకు ఫుట్ఫాల్స్ పెద్దగా లేవు. తెలుగు వెర్షన్ తొలి ఐదు రోజుల్లో రూ. 3 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది.

కేరళలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాకు తెలుగులో పెద్దగా ఆదరణ లేకపోవడానికి కారణం లేట్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ ప్లానింగ్ సరైన వ్యూహం లేకపోవడమే అని చెబుతున్నారు. ఇకనైనా మలయాళ సినిమాలు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు. హీరోయిన్కి ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునే ఉద్దేశంలో ప్రాథమిక అంశాలను మరిస్తే ఇలానే ఉంటుంది అనే చర్చ కూడా మొదలైంది.
‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు గిరీశ్ ఏడీ నుండి వచ్చిన ‘ఏజ్ గ్యాప్ ప్రేమ కథ’ ఈ సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే వారికి ఈ సినిమా వల్ల పెద్దగా నష్టం కలగలేదు అని టాక్. అంతా పర్సంటేజీల కాన్సెప్ట్లో రావడం వల్ల ఆ నష్టం లేదు అని చెబుతున్నారు.















