Pallavi Prashanth: ఆ డబ్బులను రైతులకే ఇస్తానన్న పల్లవి ప్రశాంత్.. జై శ్రీరామ్ అంటూ?

  • February 19, 2024 / 07:52 AM IST

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన కంటెస్టెంట్లలో పల్లవి ప్రశాంత్ ఒకరు. బిగ్ బాస్ సీజన్7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన పారితోషికాన్ని రైతులకిస్తానని చెప్పారు. అయితే పల్లవి ప్రశాంత్ ఆ మొత్తాన్ని ఇప్పటివరకు రైతులకు ఇవ్వకపోవడంపై నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఈ కామెంట్లు పల్లవి ప్రశాంత్ దృష్టికి కూడా రావడంతో స్పందించి క్లారిటీ ఇచ్చారు. ప్రాణం పోయినా తాను ఇచ్చిన మాటను మరవనని నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తానని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు.

నిరుపేద రైతు కుటుంబాల కోసం ఇచ్చిన మాట ప్రకారం బిగ్ బాస్ ఫ్రైజ్ మనీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తానని రైతులకు ఆ మొత్తాన్ని అందజేస్తానని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు. జై జవాన్.. జై కిసాన్.. జై హనుమాన్.. జై శ్రీరామ్ అంటూ పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు. పల్లవి ప్రశాంత్ క్లారిటీతో ఇకనైనా విమర్శలు ఆగుతాయేమో చూడాల్సి ఉంది.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో తర్వాత స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తూ ఫ్యాన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు. పల్లవి ప్రశాంత్ కు ట్యాక్స్ లు పోగా బిగ్ బాస్ షో ద్వారా 17 లక్షల రూపాయలు ఫ్రైజ్ మనీ వచ్చాయని తెలుస్తోంది. 17 లక్షల రూపాయలు కూడా తక్కువ మొత్తం కాదనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోకు వారానికి లక్ష రూపాయల చొప్పున పల్లవి ప్రశాంత్ కు పారితోషికం దక్కిందని భోగట్టా.

పల్లవి ప్రశాంత్ సినిమాలు లేదా రాజకీయాలను ఎంచుకుంటే ఆయన కెరీర్ బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ భవిష్యత్తులో మరింత ఎక్కువ మొత్తం సంపాదించి రైతులకు మరింత సహాయం చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వివాదాలకు ఛాన్స్ ఇవ్వకుండా పల్లవి ప్రశాంత్ కెరీర్ ను కొనసాగించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus