పవన్, క్రిష్.. ప్రాజెక్ట్ కు ఇన్ని చిక్కులా?

పవన్ కళ్యాణ్ ఓ పక్క తన ‘జనసేన’ పార్టీకి సంబంధించిన పనులు చక్కపెడుతూనే మరోపక్క తిరిగి వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ (‘పవన్ 26’ వర్కింగ్ టైటిల్) మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసాడు. ఇక రెండో షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. మే లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా పవన్ 27వ చిత్రాన్ని క్రిష్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కు అనేక సమస్యలు ఏర్పడుతున్నాయట.

ముందుగా హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చెయ్యలేదు. ముందుగా కియారా అద్వానీ అన్నారు.. కానీ ఆమె మరో ప్రాజెక్ట్ తో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ హీరోయిన్లైతేనే కరెక్ట్ అని భావించి వారిని క్రిష్ వారిని అప్రోచ్ అవ్వగా.. ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదట. మరో పక్క ఇది పీరియాడిక్ డ్రామా కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువగా ప్లాన్ చేశారట. కానీ నిర్మాత ఏ.ఎం.రత్నం అంత పెట్టుబడి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడట. దీనికోసం దర్శకుడు క్రిష్ మరియు నిర్మాతలు ముందుగా ఈ చిత్రం శాటిలైట్ మరియు డిజిటల్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ ను అమ్మి .. అలా వచ్చిన డబ్బుతో సినిమాని ప్రారంభించాలని.. తరువాత థియేట్రికల్ రైట్స్ విషయంలో లాభాలు పొందవచ్చు అని కొత్త ప్లాన్ వేస్తున్నారట. మరి వీరి ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus