విచారణకు రావాలని నటి, నటుడికి సమన్లు..!

  • September 15, 2020 / 08:29 PM IST

డ్రగ్స్ కేసు బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలిగా ఈ కేసులో అనేక అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే రియా మరియు ఆమె తమ్ముడు షోవిక్ అరెస్ట్ కావడం జరిగింది. వీరిద్దరితో పాటు కొందరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. కాగా సౌత్ లో కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా డ్రగ్స్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. కన్నడ పరిశ్రమలో జరుగుతున్న డ్రగ్ దందాపై ఓ ప్రముఖ జర్నలిస్ట్ కీలక ఆధారాలు ఇవ్వడం జరిగింది.

హీరోయిన్ సంజనా గాల్రాని, రాగిణి ద్వివేది డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ కాబడ్డారు. వీరిని అధికార్లులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంజనా గల్రానికి డ్రగ్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయని అధికారులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇక వీరు అనేక మందికి పరిశ్రమలో డ్రగ్స్ సప్లై చేసేవారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విచారణలో వీరు చెవుతున్న పేర్లు ఆధారంగా మరికొందరి అరెస్టులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా కన్నడ పరిశ్రమకు చెందిన నటి ఇంద్రిత రే, దిగంత్ లకు అధికారులు సమన్లు జారీ చేయడం జరిగింది. వీరు రేపు విచారణలకు హాజరుకావాలని అధికారులు సమన్ల ద్వారా తెలియజేశారట.

దీనితో ఇంద్రిత రే, దిగంత్ రేపు అధికారుల ముందు విచారణకు హాజరుకువాలి.బెంగుళూరు హెబ్బా లేక్ సమీపాన గల రిసార్ట్ పై అధికారులు సోదాలు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఈ రిసార్ట్ నడుపుతున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. విచారణ కొనసాగుతుండగా, ఎంత మంది పేర్లు బయటికి వస్తాయో అర్థం కావడం లేదు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus